ఎల్లమ్మ పట్నాలలో  జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రత్యేక పుజాలు

ఎల్లమ్మ పట్నాలలో  జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రత్యేక పుజాలు

ముద్ర, బిరుపూర్: బీర్పూర్ మండలంలోని తుంగూర్  గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవి  పట్నాలు,  బోనాల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డా. గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  బీర్పూర్ మండలం గౌడ సంఘం అధ్యక్షుడు శీలం రమేష్ గౌడ్, జిల్లా గౌడ సంఘం కార్యవర్గ సభ్యులు దోసారపు బుచ్చన్న గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు బట్టల దుబ్బాయ గౌడ్, లింగన్న, సత్తాన్న, పెద్ద గంగయ్య, శంకర్, రాజేశం, రాజన్న, గంగన్న తదితరులు పాల్గొన్నారు.